ములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి, మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు. మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి ముగ్గురు గ్రామస్తులు సహకారంతో వాగులు సైతం దాటుకుంటూ కాలినడక ద్వారా సాయంత్రానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయం 11 కుటుంబాల గ్రామస్తులను కలిసి వర్షాకాలంలో సంభవించే వ్యాధుల గురించి వివరించారు. వాటిని ఏ విధంగా నివారించాలో అవగాహన కల్పించారు. మలేరియా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ట్రీట్మెంట్ చేసి మందులు అందజేశారు. 30 మందికి దోమతెరలు పంపిణీ చేసి వాటిని వాడుకునే విధానం గురించి గ్రామస్తులకు తెలియజేశారు.
DMHO అప్పయ్య తన సొంత ఖర్చులతో 11 కుటుంబాలలోని 39 మందికి నిత్యవసర సరుకులు అందజేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90683