రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు మిడ్ మానేర్ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ సర్కారు హయాంలో ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాడి తాను అనేక కేసులు ఎదుర్కొన్నానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. నిర్వాసితుల ఉద్యమంలో రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే సత్యం.
గత బిఆర్ఎస్ సర్కారు మిడ్ మానేరు కింద విలువైన భూములను లాక్కొని బాధితులను రోడ్డున పడేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు వారిని అక్కున చేర్చుకుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. నిర్వాసితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91210