టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో సురేశ్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ఆయన ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కనిపించలేదు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వివరాలు సేకరించేందుకు సురేశ్ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించింది. మరోవైపు, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సోలార్ డ్రైయర్తో విలువ ఆధారిత ఉత్పత్తులు.సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే…
- నీట్ రీ -ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…
- ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
- సింగపూర్లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
- భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్తో ప్రధాని మోదీని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 144597