narasapuram
నేడు నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబు(Chandrababu) పలు జిల్లాల్లో పర్యటన..
టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. నేడు నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభ(Public meeting)ల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలను పార్టీ నేతలు సమీకరిస్తున్నారు.
ఇది చదవండి: కన్నతల్లి గొంతు కోసిన కసాయి కొడుకు…
అలాగే, రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్షోలో పాల్గొంటారు. ఇక, ఏప్రిల్ 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో నిర్వహించిన చంద్రబాబు రెండో విడత యాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఎన్డీయే కూటమిలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇక్కడ అనేక మంది హేమ హేమిలు తలపడ్డారు. గెలుపొందారని పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇంతటి అవకాశం నాకు ఇచ్చిందన్నారు. కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని, రాష్ట్రంలోఅరాచక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమా వ్యక్తం చేశారు.
నరసాపురం పార్లమెంట్ ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన భూపతి రాజు శ్రీనివాసవర్మ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకున్న వర్మకు, హారతులు ఇచ్చి గజమాలతో బిజెపి శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా భీమవరం ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు.
ఇది చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Narasapuram :
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ 27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో మరోసారి డోల్లతనo బయటపడింది. గత నెలలో 100 మీటర్ల మేర గట్టు గోదావరిలోకి కృంగిపోయింది. మళ్లీ చేపట్టిన పనులు కూడా వృధా అయ్యాయి అర్ధరాత్రి కోతకు గురైన చోట వేసిన రాళ్లన్నీ గోదావరిలోకి కృంగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2022 గోదావరి వరదకు ఏటిగట్టు సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఈ పనులను గత ఏడాది ఏప్రిల్ లో చేపట్టారు. వాడుతున్న రాళ్లు నాసిరకమైన, ప్రభుత్వం తిరస్కరించిన క్వారీ నుంచి రాళ్లు తీసుకొచ్చి పనులు చేపడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆందోళన కూడా చేశారు. ఈ ఫిర్యాదు పై ప్రభుత్వం స్పందించలేదు. అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. నీటిలో రాళ్లు గట్టి పడే వరకు ఇలా కృంగితోనే ఉంటుందని దీనికి ఆందోళన చెందనవసరం లేదని చెప్పడం గమనార్హం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90705