తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున లోకేష్ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జనసేన సహకారంతో రెండు పార్టీలు అధికారంలోకి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన యువగళం ద్వారా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన లోకేష్ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసామని అదే విధంగా లోకేష్ ఆసయాలకు అనుగుణంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించమని వీర్రాజు చౌదరి తెలిపారు.
news
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… నారా లోకేష్ యువ గళం అనే పేరుతో రాష్ట్రము మొత్తం చుట్టూ వచ్చి ఆంధ్ర రాష్ట్రం లో యువ గళమే నారా లోకేష్ అనే విధంగా ఆయన పేరు ను మైమరిపించే విధంగా చేశారు. నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు, లోకేష్ బాబు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని పార్టీ శ్రేణుల్లో మరింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపాలని వేగేశన కోరారు.
నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో మొత్తం 2,900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3,300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో, ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా, మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలుపుతున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి ఇనామనస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు.. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను మూడు విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశానని వివరించారు. అయితే తనకు ఇప్పటివరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని ఈ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను, కిత్తమురుపేటలో గల చంద్రబాబు సాగర్ ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి సాగర్ కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్ కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమ పట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు.
రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. వినాయక సర్కిల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం శాంతినగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. తన అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సవంతో జరుపుకున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకొని పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్రం నష్టం చేకూర్చిందని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు.
సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు. అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా.. 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీవో అమరేందర్ పేర్కొన్నారు. అయితే ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది టిఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఆరు మంది బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో సహా మిగతా ఐదుగురు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఏనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైర్హాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డిఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు.
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు. తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.