Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన సత్యప్రభ…

ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన సత్యప్రభ…

by Prakash
Satya Prabha inspected the irrigation projects...

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని ఈ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను, కిత్తమురుపేటలో గల చంద్రబాబు సాగర్ ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి సాగర్ కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్ కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమ పట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78685

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.