Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh మహిళా కౌన్సిలర్ మీడియా సమావేశం…

మహిళా కౌన్సిలర్ మీడియా సమావేశం…

by Prakash
Puttur Women Councilor media conference..

తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి ఇనామనస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు.. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను మూడు విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశానని వివరించారు. అయితే తనకు ఇప్పటివరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

019606
Total views : 91203

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.