పిఠాపురం వీరవాడ రోడ్ బ్రాహ్మణ అగ్రహారం వద్ద జరుగుతున్న లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమానికి నాగేంద్రబాబు (Nagababu) హాజరయ్యారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికైన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో హిందువుల సొమ్ములు వక్రమార్గం పడుతున్నాయన్నారు. వక్స్ బోర్డ్ గాని క్రిస్టియన్ మిషనరీలు గాని ప్రభుత్వం ఆధీనంలో లేవన్నారు. కేవలం హిందూ దేవుళ్ళ గుళ్ళు మాత్రమే ప్రభుత్వం పెత్తనం చెలాయించడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. 90 శాతం హిందువులకే గుళ్ళు, గోపురాల పై ఆజామాసి ఉండాలి, కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం దీని మీద అబ్జర్వేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్ ఉండి ఉంటే కచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చే వారురన్నారు. కూటమి పార్టీ జనసేన అధికారంలోకి రాగానే ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…




Total views : 212636