గుంటూరు లో చైన్ స్నాచింగ్ దొంగను పట్టుకున్న నల్లపాడు పోలీసులు. నల్లపాడు పొలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు
నల్లపాడు SHO రాంబాబు మాట్లాడుతూ నగరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు. సమ్మితి నరసింహ అనే ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసగా మారి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డాడు. ముద్దాయి 2 కేసులలో దొంగ గా నిర్ధారించారు… ముద్దాయి వద్ద నుండి 39 గ్రాముల బంగారం రికవరీ చెయ్యటం జరిగింది. రికవరీ చేసిన బంగారం విలువ 2 లక్షల రూపాయలు వరకు ఉంటుంది దొంగతనానికి ఉపయోగించిన 2 వీలర్ ను సైతం స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసాము..
Police
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుండ్లపల్లి టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళికి అనుగుణంగా సీఎం కేసీఆర్ సిబ్బంది కూడా అధికారులకు సహకరించారు.
Read Also..
Read Also..
తూర్పు గోదావరి జిల్లా…
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీ ఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ కుమార్ దాడి తలపై రక్తస్రావం జరిగేలా తీవ్రంగా దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్. తక్షణమే కానిస్టేబుల్ కరుణ్ సస్పెండ్ చేయాలని రాజమండ్రి రామాలయం సెంటర్ లో నడి రోడ్డు పై కూర్చుని నిరసన తెలుపుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి.
Read Also….
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో బిఎస్ఎఫ్, జవాన్లతో పాటు సాయుధ పోలీసులు అంగడి బజార్ నుంచి బ్లాక్ చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి మాట్లాడుతూ …..ఈనెల 30న జరుగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమస్యత్మక ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రత్యేక నిఘా వేసినట్లు జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ కమాండెంట్ దీపంకర్,విద్యాసాగర్, మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఆర్ఐ.వేణు, ఎస్సైలు అశోక్, వెంకట్రావు, సతీష్, కుమారస్వామి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణములోని ధోనిముక్కల పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచిన దాదాపు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సెబ్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక రెవిన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ దందాలకు పాల్పడితే డయల్ 100కు సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచించారు.
Read Also..
Read Also..
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, నకిలీ బంగారు, నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దేవరకొండ సుధీర్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసు వాహనాలలో వచ్చి తనిఖీలు చేస్తూ,వివరాలను ఆరా తీశారు. గ్యాంగ్ లీడర్ సుధీర్ కూడా పోలీసులు వెంట ఉన్నట్టు సమాచారం.
బోరబండలో ఓ ఎస్సై చేస్తున్న హంగామా తో స్థానికులు వాహనదారులు తీవ్రభయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి వేళలో కర్ర పట్టుకుని తిరుగుతున్న ఎస్సై కళ్ళకు ఎవరైనా కనిపిస్తే చాలు వీపు విమానం మోత మోగిస్తున్నారు.. అలాంటి కొన్ని దృశ్యాలను సాక్షాత్తు ప్రజలే తెలియకుండా వీడియోలు తీసి ఎస్సై చేస్తున్నా అరాచకాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న మెహ్రూన్ బి 8 సంవత్సరాల క్రితం భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇంటి స్టోర్ రూమ్ ఆవరణలో అచేతనంగా పడి ఉన్న మహిళను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యకు దూరంగా ఉంటున్న భర్త వలి ఉపాధి పని నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు. ఆమె మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్ వివరించారు. ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు, బంగారం ప్రభావాన్ని తగ్గించేందుకు సర్వేలేన్స్ టీమ్లను ఏర్పాటు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రూ. 46.81 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నగరంలో ఇతర జిల్లాల నుంచి అక్రమ రవాణాను నిరోధించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, అదనపు సీపీ విక్రమ్సింగ్మాన్, కలెక్టర్, డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.