రాజోలు దివిలో ఓఎన్జీసీ వల్ల పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నా వారిని గుర్తించి.. NGD ఒక్క ప్రత్యేకమైన కమిటీ నియమించి దాని ద్వారా ఓఎన్జిసి నడ్డి విరిసి 22.76 లక్షల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు మంజూరు చేయడంతో రాజోలు దీవిలో ఉన్న పలు గ్రామాల్లో చింతలపల్లి గ్రామానికి 47లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణం, అదే విధంగా గుడిమెళ్ళంక గ్రామానికి 8లక్షలు, కేశనపల్లి 63లక్షల రూపాయల వ్యయంతో.. అదేవిధంగా రాజోలు ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 65లక్షల నిధులను మంజూరు చేసినట్లు NGD కమిటీ సభ్యుడు యనమల వెంకటపతి రాజా తెలిపారు. ఓఎన్జిసి ఈవో అమిత్ నారాయణ అన్ని విధాల కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఓఎన్జీసీ నుంచి భారీ స్థాయిలో నిధులను తెచ్చి రాజోలు ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఓఎన్జిసి చేస్తున్న సేవలను నాయకులు అవగాహన కల్పించలేకపోతున్నారని మాలాంటి వాళ్లు ఓఎన్జీసీ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని వెంకటపతి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో NGD మరో సభ్యులు పీకే రావు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
rajolu
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్మ్యాప్ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also..
Read Also..
అమరావతి ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ. ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర. గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు. అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న లోకేశ్. ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభం. ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగితెలుసుకున్న నారా లోకేశ్. పాదయాత్రలో హామీలిస్తూ ప్రజలకు భరోసా కల్పించిన యువనేత.





Total views : 91126