మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిన యువకులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఆందోళన చేస్తున్న యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుంది అని సరైన బుద్ధి చెబుతామని యువకులు అన్నారు. దాదాపు 100 మందికి పైగా యువకులు ఒక్కసారిగా బొత్స క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మెగా డీఎస్సీ తో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన యువజన సంఘం నాయకులు.
sports news
అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు. బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం. చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్. మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు. మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్. తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి. పత్తాలేని హాస్టల్ వార్డెన్. చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు.
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Total views : 90329