రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో చేసిన వాగ్దానాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీతాలు పెంచాలని, గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి విడనాడాలని సిపిఐ నాయకులు అందే నాసరయ్య అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేల రూపాయలకు పెంచాలని, మున్సిపల్ కార్మికులకు అపస్తృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత 13 రోజులుగా చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని తెలుపుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం, ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
State Govt
చిత్తూరు జిల్లా, నగరి మండలం, అయనంబాకం తన స్వగ్రామమని, సి .సి .రోడ్లు మంజూరు కాబడి దాదాపు నాలుగు సంవత్సరాలు అయిందని, పనులు మొదలెట్టలేదని, సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్కు తీసుకోమని కాంట్రాక్టర్లు చెపుతున్నారని నారాయణ ఆరోపించారు. ఆ తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామని వారు రోడ్లు పనులు మొదలు పెట్టకపోవడం పై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. ఏలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని విస్మరించాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి దళితులపై కపట ప్రేమ చూపిస్తూ వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు..






Total views : 79704