Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రండి…. ప్రజా వ్యతిరేక పాలనను తరిమికొడదాం

రండి…. ప్రజా వ్యతిరేక పాలనను తరిమికొడదాం

by Prakash
Discussion meeting at Eluru Congress Party office

కేంద్రంలోని బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. ఏలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని విస్మరించాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి దళితులపై కపట ప్రేమ చూపిస్తూ వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు..

Advertisements

You may also like

Our Visitor

013860
Total views : 78209

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.