మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాన్నారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, తర్వాత దర్గాకు కూడా వెళతానన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరానని తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితమిస్తున్నానన్నారు. నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారని.. కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారన్నారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని.. ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకునన్నారు.
Tdp
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.
• జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023ను రద్దు చేయాలి.
• ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.
• సివిల్ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారు.
• ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే ఆస్కారం ఉంది.
• సివిల్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలనుకుంటే కోర్టులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
• న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి.
• జగన్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ఇస్తానన్న రూ.100కోట్లలో రూ.75కోట్లు నేటికీ రాలేదు.
• కోర్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు పూర్తిచేయాలి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులు వేగంగా పరిష్కరించాలి.
• రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంపును రద్దు చేసి, రూ.100 వెల్ఫేర్ స్టాంపును అమలు చేయాలి.
• న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
• 41ఏ సీఆర్పీసీ నోటీసుల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.
లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు వేసే దుర్మార్గపు సంస్కృతిని తెచ్చాడు.
• న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు.
• సామాన్యుడికి న్యాయాన్ని దూరం చేసేలా నల్ల చట్టాలు తెస్తున్నారు.
• న్యాయమూర్తులను సైతం సైకో సోషల్ మీడియా గ్రూపుల్లో కించపరుస్తున్నారు.
• మేం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు రక్షణ చట్టం తెస్తాం.
• ల్యాండ్ లైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం.
• న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాం.
• నిలిచిపోయిన కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం.
• సత్వర న్యాయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమల్లోకి తెస్తాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామానికి చెందిన శాఖ నాగ దుర్గ ప్రసాద్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే అధికార పార్టీకి చెందిన యువకుడు, టేకులబోరు గ్రామంలోని ఓ కిరాణా షాపుకు వచ్చిన నాగ దుర్గ ప్రసాద్ కు అక్కడే షాపు వద్ద ఉన్న బత్తుల వెంకటేష్ అనే యువకుడికి మధ్య మాట మాట రావడంతో వెంకటేష్ అనే యువకుడు షాపులో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని దుర్గ ప్రసాద్ పై పోసి వెంటనే నిప్పు అంటించడంతో పక్కనే షాపులో ఉన్న మరో వ్యక్తి మంటలు ఆర్పీ బాడుతుడను ఆసుపత్రికి తరలించారు, బాధితుడు సోదరి మాధివి జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని అవతలి వ్యక్తి అధికార పార్టీ యువకుడు కావడంతో కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించింది, కేసు గత నెల 18 వ తేదీన ఘటన జరిగితే 21 వ తేదీ వరకు FIR నమోదు చేయలేదని బాధితుడి అక్క ఆరోపించింది పైగా అతనిపై ఏదో సెక్షన్ మీద కేసు నమోదు చేసి వాళ్ళతో రాజీపడమని పోలీసులు పదే పదే చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు, విషయం ఆలస్యంగా బయటకు రావడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు యడవల్లి భాస్కర్, బరపారి ప్రకాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాజోలులో వేడెక్కిన రాజకీయం, ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. యువగళం పాదయాత్ర సందర్భంగా , నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ ఇరువురి గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ, గొల్లపల్లి అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, 20 ఎకరాలలో ఆదుర్రు గ్రామంలో అక్రమ సొమ్ముతో కాలేజీ నిర్మించారని ఆరోపణలు చేశారు, సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సూర్యరావు అని, గొల్లపల్లి అవినీతి తెలిసే చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ, నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, లోకేష్ ను విమర్శించే స్థాయి రాపాక లేదని గొల్లపల్లి అన్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారం ఉన్న వ్యక్తి అని అందుకే పవన్ కళ్యాణ్ , రాజోలు నియోజకవర్గనికి వచ్చిన రాపాకపై మాట్లాడలేదని గొల్లపల్లి సూర్యరావు అన్నారు.
ఈ రోజు పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాళహస్తేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన అనంతరం వారు ఊరందూరు లో సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొని కేక్ కట్ చేసారు. పత్రిక సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచన ని ప్రజలకు వివరించారు. గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా ఉత్తరాంధ్రలో రాజధాని అని లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు, ఋషికొండ కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకపోయినా కూడా అందులో కట్టడాలు నిర్మిస్తూ ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని ధ్వజమెత్తారు, రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ని ద్వంసం చేయడానికి చూస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల కృష్ణారెడ్డి గారితో కలిసి గంటా శ్రీనివాసరావు విద్యాసంస్థలకు అభివృద్ధి పథంలో నడపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గంటా శ్రీనివాసరావు సహకారం తో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి పథంలో నడపటానికి కృషి చేస్తానని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కాయమని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం చూస్తుంటే నారా చంద్రబాబునాయుడు తిరుమలకు రావడంతో వారు బస చేస్తున్న అతిథి గృహం వద్ద నేను వెళ్తే అక్కడున్న సిఐ, డిఎస్పి విచక్షణరహితంగా మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధి అని కూడా లేకుండా ఏకవచనంతో సంబోధించడం దారుణమని వారిపై ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇస్తానని తెలిపిన కంచర్ల శ్రీకాంత్.
తిరుమలలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. భద్రత కారణాల రీత్యా అడ్డుకున్నామని అర్థం చేసుకోవాలంటూ పోలీసుల సర్దిచెప్పారు. ఎట్టకేలకు చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు పోలీసులు అనుమతినిచ్చారు.
తిరుమలలో నేడు శ్రీవారి దర్శనార్థం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణమవుతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి డిసెంబర్ 1వ తేది ఉదయం 7 గంటలకు ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకొని 8 గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు.
Read Also..