టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులన్నీ నిరాధారమైనవని నిరూపణ అయిందని నాయకుడు దేశానికి రాష్ట్రానికి కావలసిన నేత చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి కలిసి అక్రమ కేసుల్లో నిర్బంధించడం జరిగిందని ఈరోజు న్యాయం గెలిచి అధర్మం బంధింపబడిందని దానికి నిదర్శనం సాక్షాత్తు న్యాయమూర్తి ఈ కేసులపై ఆధారాలు లేవని అనడం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారని ఇదే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలల జైలు శిక్ష చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పుడు న్యాయమూర్తి కేసులపై వ్యాఖ్యానించకపోవడం వ్యత్యాసాన్ని గమనించండి అని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తను ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా కాకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నాడని త్వరలోనే నీకు తగిన మూల్యం చెల్లిస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. మొన్న దీపావళి రోజున నరకాసుర వద్ద జరిగిందని కానీ ఈరోజు రాష్ట్రానికి పట్టిన జగన్ ఆసుర దహనం ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమైన దీపావళి చేసుకుంటారని అన్నారు.
Tdp
కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన నాయకులు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ జనసేన నాయకులు డాన్స్ వేస్తూ ఈలలు కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ.. న్యాయస్థానం పై నమ్మకం ఉంది కాబట్టే న్యాయం గెలిచిందని, చెప్పిన విధంగానే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని, టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, చంద్రబాబు కు బైయిల్ వచ్చింది. వైసీపీ పతనం ఆరంభమైంది అంటూ ఎద్దేవ చేశారు.
Read Also..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.
నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది. దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా.. అసెంబ్లీలో అడుగుపెడతా.. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం చేశారు. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం విస్తృతంగా పర్యటించారు. తమ అభిమాన నాయకుని కుమారుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం తమ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న ముస్లిం యువత అధిక సంఖ్యలో ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరామ్ మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండడం ఖాయమని కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక ప్రజాభిమానంతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా అంతే తద్యం అన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే నాయకుల్ల రోజుకో జెండా మోయడం కోడెల రక్తంలో లేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నానని యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుదేశం నాయకత్వాన్ని బలపరచాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కోడెల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని కొడాలి ఎద్దేవా చేశారు. తండ్రి మరణానికి కారణమైన పురందేశ్వరి ఇప్పుడు టీడీపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురింధేశ్వరికి వాటాలు అందాయి. అప్పుడు నోరు మూసుకున్నపురందేశ్వరి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతుంది. వైసీపీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అంటూ కొడాలి నాని హెచ్చరించారు.
Read Also..
Read Also..
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ ల ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిని ప్రజలు పడుతున్న దుస్థితిని ఎండగడుతూ నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు, నున్న గ్రామం నుంచి సూరంపల్లి వెళ్లే రహదారి దుస్థితిని వివరిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి వైసిపి ప్రభుత్వం అరాచక పాలన గురించి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు కొల్లా ఆనంద్, గొడ్డళ్ళా చిన్నారావు, జనసేన జిల్లా కార్యదర్శి పొదిలి దుర్గారావు నియోజవర్గ జనసేన మహిళ నాయకురాలు మేకల స్వాతి, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ అని విమర్శించారు. జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందన్నారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్. ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా? తెలంగాణ తరహాలోనే ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా? లేక, టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావొచ్చేమో కానీ, బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
యావత్తు ప్రపంచం ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద పండుగగా అభివర్ణిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన టిడిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీలను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు టీం ఇండియా అభిమానులు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. చిన్నా పెద్ద ఆడ మగ తేడా లేకుండా క్రికెట్ చూసేందుకు ఇక్కడ వనభోజనాల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మాకు కాకుండా జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు.
Read Also..
Read Also..




Total views : 91108