చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, అన్నురు పంచాయతీ, మిట్ట హరిజనవాడ లో ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి పంచాయతీలో వైసిపి కార్యకర్తలు అభిమానులు భారీ షాక్ ఇచ్చారు వైయస్సార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తమను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానంతో డాక్టర్ థామస్ ను గెలిపించాలని ధ్యేయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ప్రతి ఇంటికి స్వీట్ బాక్స్ పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ…. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం డాక్టర్ థామస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు ఆరు మండలాల నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tdp
ఏపీలో జగన్ పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్… జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13న సమావేశం కానుంది.
కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడంలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్నవారు లేరా అని నిలదీశారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ చేయడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. అమిత్ షా పనిగట్టుకుని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సృజనా చౌదరి, సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నప్పుడు కేసులు వేశారు. వారు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీకి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీ వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు. ఇండియా కూటమిలో నితీష్, కుమార్, శరత్ పవార్, మమతా, స్టాలిన్ లు రాహుల్ కు మద్దతుగా ఉన్నారని ఈసారి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడే నాటకాలకు యువత బలి అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందన్నారు. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇచ్చారా? ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు.. ప్రకటించారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. జగన్ పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదన్నారు. ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్ కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు జగన్. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందన్నారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్.. రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామన్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు.
Read Also..
Read Also..
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చంద్రగిరి గుర్తింపు పొందింది చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. నియోజకవర్గం పరిధిలో దాదాపు 35 వేల దొంగ ఓట్లను చంద్రగిరి టిడిపి ఇంచార్జీ పులివర్తి నాని గుర్తించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరుపతి తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నకిలీ ఫాం 6 ను అప్లై చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. గుర్తించిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు.
తిరుపతి లో దొంగ ఓట్లు అధికంగా నమోదు అయ్యాయి అని, పాత జాబితాలో చనిపోయిన వారి పెర్లు రెండు సార్లు నమోదు అయ్యాయి అని అధికారులు కు ఫిర్యాదు చేసామని, అధికారులు పట్టించుకోలేదని చనిపోయిన, రెండు ఓట్లు నమోదును అలాగే ఉంచేసారు అని ఆరోపించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధికారి ఆదేశాలు భేఖాతరు చేస్తూ న్నారని,బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించలేదని,తాము క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించిన అందజేసినా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు విడుదల చేసిన జాబితా గందరగోళం గా ఉందని అన్నారు.మార్పులు, చేర్పులు ఎక్కడ ప్రస్తావించలేదని, అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఓటరు కార్డు ఆధార్ కార్డు లింకు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. 26వ డివిజన్ లో మూడు వందలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని, వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదని వారిని అధికారులు చూపించగలరా అని ప్రశ్నించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ.
Read Also..
శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బాగుంటే చాలు, నా పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటే చాలని జగన్ రెడ్డి నాలుగు నరేల్లగా అవినీతి అక్రమాలు చేస్తూ ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన పెద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలో యువత జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. టిడిపి పాలనలో సమాజం బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి యువతకు పెద్దపీట వేస్తూ 6.50 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తునివ్వటం చేతగాని అసమర్ధ సీఎం జగన్ రెడ్డి గజ దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అధికారులకు చింతమనేని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించలేదంటూ ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. గత అర్ధరాత్రి వేళ పోలవరం కుడి కాలువ వద్ద పలు వాహనాలను పట్టుకున్నారు. చింతమనేని 10 లారీలను, 2 జేసీబీలను, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తాను పట్టుకున్న వాహనాలతో సహా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు కదలబోనని చింతమనేని నిరసనకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ వద్దే నిరసన తెలుపుతున్నారు.






Total views : 90620