vijayawada
ఎన్టీఆర్ జిల్లా, రేపటి దెందులూరు సీఎం సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై పార్టీ నేతల్లో గందరగోళం. మైలవరం కేడర్ ను సీఎం సభకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్న ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గం పరిశీలకుడు పడమట సురేష్ బాబు. ఈ నెల 4 లేదా 5 న ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెబుతానని ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని. ఎంపీ కేసినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపిని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు. కొడాలి నానిలా బూతులు మాట్లాడుతూ కేశినేని నాని తయారయ్యాడు. మేము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యం.
విజయవాడ, అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సమ్మె విరమిస్తున్నాం, రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం. జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపు చేస్తాం అన్నారు. సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అని వెల్లడించారు.
విజయవాడ, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం. జూలై లో జీతాలు పెంచుతాం. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ కార్యకర్తలు అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించిన పొలిసులు. కూలీలు మేము అంగన్వాడీ కార్యకర్తలు కాదు అని చెప్తున్న వినకుండా వారిని స్థానిక ఒక ఫంక్షన్ హల్ కు తరలింపు. అదే ఫంక్షన్ హల్ లో అప్పటికే అదుపులో తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతు కూలీలు. చివరికి రైతు వచ్చి మా పొలంలో పనికి వచ్చిన కూలీలు అని చెప్పిన తర్వాత వారిని వదిలిన పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు. పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. స్థంబిస్తున్న ట్రాఫిక్. రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు. పోలీసులు, అంగన్వాడీ వర్కర్స్ మద్య పెనుగులాట, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల పై తిరగబడుతున్న అంగన్వాడీ ఉద్యోగులు. అదుపులోకి తీసుకోబోయే మహిళా పోలీసులను రోడ్డుపై కూర్చోబెట్టిన అంగన్వాడీ వర్కర్. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్. నిలువరించలేకపోతున్న పోలీసులు సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం. పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల పై మండిపడ్డ సీఐ. మహిళా పోలీసుల వల్ల కాకపోవడంతో సీఐ, ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలిస్తున్న వైనం. పోలీస్ స్టేషన్ లోపల అరుపులు వినపడటంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా. పోలీసులు గేట్లు వేసి మీడియాని లోపలికి అనుమతించని పరిస్థితి.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 లో గెలిచేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అని, ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన భయపడే ప్రసక్తి లేదని ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి పెనమలూరు గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం. పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు. రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు. కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు. వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది. నేను భాద్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో మా కాన్వాయ్ నీ ఎందుకు ఆపారు ? మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ ? అంటూ పోలీసులతో వాగ్వాదం. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వాహన కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు. ఎనికే పాడు వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు. వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.
విజయవాడ, బుద్ధ వెంకన్న, ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా, బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని, 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా ? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా ? కే అంటే కేశినేని కాదు… కోవర్టు. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు. దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని. వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని. భూకబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని
చంద్రబాబు కేశినేని నానిని మెడబట్టి గెంటాడు అనేది నిజం. బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మోహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని. బాలయొగి ఆస్తులు ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు.. కేశినేని నాని ఊహల్లో బ్రతికే వ్యక్తి కనుకనే చంద్రబాబు స్ధాయి అని చెప్పుకుంటాడు. లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది. కేశినేని నాని వెనుక నందిగామలో పదిమంది లేరు. కేశినేని నాని టిడిపి వీడితే పది మంది లేరు అతని వెనుక ఎన్నికల తరువాత వైసీపీ కేశినేని నాని సహా ఖాళీ అయిపొతుంది. ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాల్ మనీ అంటావు.. అంటే ఏంటో చెప్పు.. చర్చిద్దాం.. నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు. చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పోరపాటు ఈ కోవర్టును ఎంపీ చేయడం. చంద్రబాబు అమాయకత్వం, మంచితనంతో వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు. దాదాపు 9 కోట్ల రూపాయల చందాలు 2019లో వసూలు చేసాడు కేశినేని నాని. ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటే.. అన్నీ ఉన్న వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం. లోకేష్, చంద్రబాబు లను మర్యాదపూర్వకంగా కలిసాను. వెస్ట్ ఇంఛార్జ్ నేనేమీ అడగలేదు. కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు కేశినేని నాని. చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటాను. చంద్రబాబు కుటుంబానికి మా కుటుంబం అంకితం. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరపడింది. అన్న వదిలిన బాణం షర్మిల… ఇప్పుడు రివర్స్ అయింది…