ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక. రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం. కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు, ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు. గన్నవరం నుండి విజయవాడ వరకు ఎటు చూసినా షర్మిల ఫ్లెక్సీలు. షర్మిల రాక రెండు గంటలు ఆలస్యం అయిన కానూరు సభాస్థలి వద్ద కార్యకర్తల్లో తగ్గని ఉత్సాహం.
vijayawada
కృష్ణాజిల్లా, గన్నవరం, కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల. షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, తులసిరెడ్డి. స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, పలువురు నేతలు. గన్నవరం నుండి విజయవాడ బయల్దేరిన షర్మిల. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తొలిసారి విజయవాడ వచ్చిన షర్మిల.
కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా? సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సాంసృతి మీ పరిపాలనలో జరగటంలేదా? గొంతు ఎత్తిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుట్రల రాజకీయాలతో బానిసలగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజులలో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణి చేసినట్లు పైకి చెప్తూ లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. అంగన్వాడీఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీ నేతలు ధర్నా. చల్లపల్లి ప్రదానరహదారి దిగ్బంధం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. అంగన్వాడి కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వామపక్ష పార్టీ నేతలు రహదారులను నిర్బంధించారు. చల్లపల్లి బస్టాండ్ సెంటర్ లో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా రోడ్డు దిగ్భందించి నిరసన తెలియజేస్తున్న అఖిలపక్ష ఆందోళనకారులను స్థానిక ఎస్ఐ. చిన్నాబాబు చెదరగొట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 4000 మంది పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
విజయవాడ, ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణ. స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం. ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం. విగ్రహ ఎత్తు 125 అడుగులు , బేస్ పిల్లర్( బేస్ బిల్డింగ్ ) ఎత్తు 80 అడుగులతో కలిపి 205 అడుగుల అతి భారీ విగ్రహంగా రికార్డుకెక్కనున్న అంబేద్కర్ స్టాట్యూ. 2020 జులై 9 న విగ్రహ ఏర్పాటుకు శంకుస్దాపన. డిల్లి నుండి వచ్చిన డిజైనర్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం. విగ్రహం క్రింద భాగంలో మూడు ఫ్లోర్లు ఏర్పాటు. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో భారీ హాల్స్ ఏర్పాటు. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు నిర్మాణం. డిజిటల్ లైబ్రరీ, స్క్రీన్ హాల్ , మ్యూజియం ఏర్పాటు. స్కై లైటింగ్, ఫౌంటెన్ , గార్డెన్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం. 404 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీయం జగన్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ. అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభ. ఇప్పటికే విగ్రహావిష్కరణకు, సభకు భారిగా ఏర్పాట్లు చేసిన అధికారులు. లక్షన్నర మంది వీక్షించేలా ఏర్పాట్లు.
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న టిడిపి, జనసేన ర్యాలీ. సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మెయిన్ రోడ్డుకు ఇరు వైపులా నిలబడి టీడీపీ – వైసీపీ శ్రేణుల నినాదాలు. టీడీపీ, జనసేన శ్రేణుల పైకి దూసుకెల్లే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు. ప్రతిగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. అడ్డుకున్న పొలిసులు. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు. నివురగప్పిన నిప్పులా ఉన్నా గుడివాడ.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం నా అదృష్టం. నందమూరి తారక రామారావు గారే సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం వందల పేజీలు రాయకుండా, కూడు, గూడు, గుడ్డ అనే మూడే మూడు నినాదాలతో ముందుకు సాగిన మహా నాయకుడు ఎన్టీఆర్. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్టీఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందు సాగుతున్నానని అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారం. కానీ ఒకాయన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడటం వారి స్థాయినే దిగజార్చుతుంది తప్పితే ఎవరికీ ఏమీ కాదు.