ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పటమట లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మరియు టిడిపి నాయకుడు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగారు. ఏ రంగం లో ఉన్న ఆయన అగ్రగామిగా నిలిచారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి వారసులు అయినందుకు గర్వపడుతున్నాం.
vijayawada
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం. తనిఖీల్లో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకోని, ఇక్కడ అమ్ముతున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం. సుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నాం. కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం.
విజయవాడ, కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. కోర్ట్ కి రావడం లేదు. జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు. సుబ్బరాజు శ్రీను సోదరుడు. నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు. నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి. రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం. ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని ఒక్కడికి ఒక న్యాయం. జగన్ కి అనేక సార్లు విన్నవించాం. జైల్ లో శ్రీను, విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి. లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం.
విజయవాడ, పార్టీ మారుతున్నారనే ప్రచారం పై వంగవీటి రాధా స్పందించారు. నేను టీడీపీలోనే ఉంటా, గాలి పార్టీ గాలి వార్తలను నమ్మొద్దు. కొద్దిరోజులుగా వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారం. తాజాగా ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టిన వంగవీటి రాధా. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన వంగవీటి రాధా. మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానన్న వంగవీటి రాధా.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్వామి వివేకానంద 161 వ జయంతి పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సభ్యులు మరియు ఏబీవీపీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ భుతులను ఓపెన్ చేశారు ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు ఫాస్టాగ్ రాకముందు సొంతుర్లకు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బంది పడేవారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కి నెట్టి, పరిశుభ్రమైన నగరాల్లో 3వ స్థానంలో నిలిచిన విజయవాడలో నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. విజయవాడలోని ప్రధాన కూడలి అయిన బెంజ్ సర్కిల్ వద్ద పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సమీపంలో ఉండే ఒక వైన్ షాప్ వద్ద మందుబాబులు చేసే హల్చల్ వర్ణనాతీతం. నిత్యం వేల మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు అటుగా వెళుతుంటారు. ఈ వైన్ షాప్ వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు వేస్తూ చెత్త కుండీలు గా మార్చేశారు. నడి రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో స్థానికులు అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యలను తీర్చాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ, బుద్ధ వెంకన్న, టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు. ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను. కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమ సారధి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన. మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు.




Total views : 140797