విజయవాడ, కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు. నిన్నటివరకూ చంద్రబాబు, కెసినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్. పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు. బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ల ఏర్పాటు. ఎన్టీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు.
vijayawada
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన. గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ.యు నాయకులు గొల్లపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్, దారపురెడ్డి నాగభూషణం, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ, ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు. ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు. పవన్, షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ కి వచ్చాయి. ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు ఉడకవు. మార్చిలో ఎన్నికలు వద్దు చివరి లో పెట్టమన్నాం. ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి అని డిమాండ్ చేస్తున్నా. రెండు కులాలు, రెండు కుటుంబాలేనా మనల్ని నడిపేది. నా పోరాటం ఆగదు నేను ఇక్కడే ధర్నాకు దిగతా. సౌత్, తెలుగు సత్తా మోదీకి చూపుదాం. బాబు రావాలంటే జాబు రావాలి అని గతంలో నువ్వే కదా అన్నావ్, ఏం జాబులిచ్చావు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుదాం అని కేఏ పాల్ అన్నారు.
విజయవాడ, కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పర్సనల్ రిక్వెస్ట్ వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మీద విష ప్రయోగం చేసినా దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డాను. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
విజయవాడ, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్. 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయుల నిర్భంధం. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్భంధించిన పోలీసులు. నిరసన తెలిపి తీరుతామంటున్న ఉపాధ్యాయులు. ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు. లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అరెస్టు.
ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది. పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను లూటీ చేస్తోంది రీసెంట్గా విశాఖలో కోటి రూపాయలు పైబడే బ్లాక్ మనీ దొరకడంతో సోనోవిజన్ అక్రమాలు బయట పడ్డాయి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ల లో కూడా బ్లాక్ మనీ తరలిస్తూ అడ్డంగా బుక్ అయింది.
విజయవాడ, ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలు. వేతనాలపెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్న మున్సిపల్ కార్మికులు. టీచర్ల సమస్యలపై యూటిఎఫ్ ఆద్వర్యంలో 36 గం.ల దీక్షకు పిలుపు, అనుమతి లేదన్న పోలీసులు. అయినా దీక్ష చేస్తామంటున్న యూటిఎఫ్ నేతలు. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధన్యతపై సమ్మెకు దిగుతామంటున్న 108, 104 సిబ్బంది. ఈనెల 22 వరుకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్న 108, 104 ఉద్యోగ సంఘాల నేతలు. అన్ని సంఘాలు ఒకేసారి ఆందోళనలకు పిలుపునివ్వడంతో దద్దరిల్లిపోతున్న ధర్నా చౌక్. ధర్నా చౌక్ లో ఉన్న అందోళనకారుల టెంట్లు తీసేయడానికి సిద్దమవుతున్న పోలీసులు.
అమరావతి, ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన. రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. 9న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్.





Total views : 141176