నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మేకపాటి విక్రమ్ రెడ్డిని మాజీని చేయడం దురదృష్టకరమని, ప్రజలే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తమపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఆయన అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇదే క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో 20 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
#waterproject
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరుపురాని నివాళిగా నిలుస్తోంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కు డిసెంబర్ 10వ తేదీ నాటితో 69 ఏళ్లు నిండి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మానవమేదో వికాసానికి ప్రతీక. భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ గుర్తింపును, శ్రమ శక్తిని రుజువు చేసింది కరువు తో అల్లాడుతున్న రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు సరిగ్గా 69 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ వద్ద శంకుస్థాపన చేశారు.
1955 డిసెంబర్ 10వ తేదీ నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.98 కోట్ల రూపాయలు మాత్రమే పూర్తిచేశారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పీఎఫ్ క్లెయిమ్లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్హెచ్-48పై నర్సింగ్పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 193186