పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన నరసాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేసిన ఆయన, వ్యక్తిగత విమర్శలకు తామూ సమాధానం చెప్పగలమన్నారు. అయితే అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని తమ నాయకత్వం సూచించిందన్నారు. వైసీపీ పాలనలో సామాన్యులు, వ్యాపారులు, వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అందుకే ప్రజలు మార్పును కోరుకున్నారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు.
Tag: