బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.తనకు పసపు కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే గాక.. ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి, లక్ష ఇరవై వేల రూపాయల ఫోన్లు లాక్కొని, చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో ఉన్న 3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్ తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇదివరకే పలు కేసులు నమోదు అయ్యాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమా ఫస్ట్ లుక్…
- RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా రాపో సినిమాటిక్స్ బ్యానర్పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత…
- ‘ఇరుముడి’ నుంచి గూస్బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్, జి.వి. ప్రకాశ్ కుమార్ ‘ఇరుముడి’ నుంచి గూస్బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’.…
- హర్మన్ పోరాటం వృథా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్కు చేదు ఓటమి.భారత శిబిరంలో నిరాశ నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు హ్యాండ్షేక్ల కోసం వరుసగా నిలబడగా వారి ముఖాల్లో తీవ్ర నిరుత్సాహం కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ భారత జట్టుకు మంచి ఊపు తీసుకొచ్చింది.…
- భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 181124