Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

by Rama
భూ కబ్జా కేసులో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.తనకు పసపు కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే గాక.. ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి, లక్ష ఇరవై వేల రూపాయల ఫోన్లు లాక్కొని, చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో ఉన్న 3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్ తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇదివరకే పలు కేసులు నమోదు అయ్యాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019399
Total views : 90667

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.