ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
ysrcp
కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెండ్యాల గ్రామం వరకు వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పెండ్యాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సిసి రోడ్డును ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాజకీయాలు అనేవి మనం స్వచ్ఛంగా చేయాలని, ఈ ప్రాంతంలో నాకు ఓటేసారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్నను ఉద్దేశిస్తూ నా స్థాయికి తక్కువ గల మనుషుల గురించి నేను మాట్లాడను. చీటర్స్ గురించి, బ్రోతల్ హౌసులు నడిపే వారి గురించి, కాల్ మనీ చేసే వారి గురించి మీరు మీడియాలో అనవసరంగా మాట్లాడించి పెద్దోళ్ళని చేస్తున్నారు. దయచేసి వారి గురించి నేను మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేనని ఆయన అన్నారు. నా స్థాయికి చంద్రబాబు గురించి అడిగితే చెప్తా, లోకేష కూడా నా స్థాయికి తక్కువేనని అన్నారు. కొంతమంది పాపులారిటీ కోసం నా మీద మాట్లాడతారని, ఎలక్షన్ అయ్యాక బాక్సులు తెరిచాక ఎవరి పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించవద్దని ఆయన అన్నారు. త్వరలో నా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఎవరిని బలవంతం చేయను. ముఖ్యమంత్రిగా జగన్ గారు పిలవగానే ఆయన మాట కాదనలేక జాయిన్ అయ్యాను త్వరలో మా అనుచరులతో సమావేశం అవుతానని అన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. నందిగామ పట్టణాన్ని కూడా విజయవాడ పట్టణానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
కృష్ణా జిల్లా, గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని. కోడాలి నాని మాట్లాడుతూ.. నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు. సీఎం లుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. చావటానికైన సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న టిడిపి, జనసేన ర్యాలీ. సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మెయిన్ రోడ్డుకు ఇరు వైపులా నిలబడి టీడీపీ – వైసీపీ శ్రేణుల నినాదాలు. టీడీపీ, జనసేన శ్రేణుల పైకి దూసుకెల్లే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు. ప్రతిగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. అడ్డుకున్న పొలిసులు. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు. నివురగప్పిన నిప్పులా ఉన్నా గుడివాడ.
కృష్ణా జిల్లా గుడివాడ, గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారు. చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా. ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా. చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే. కోర్టులు జైలుకు కదలి వెళ్ళు అంటున్నాయి. బాడీలో పార్టులు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. బాలకృష్ణ , చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన ఫ్లెక్సీలు తొలగించడం తప్ప. జూ. ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేరు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది ? తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది. చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే. లక్ష మంది ఎలా వస్తారు. సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారు. పది రోజులైతే టిడిపి, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే తమకు వచ్చే నష్టం లేదు. జగన్ అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. పదవులు తనకు ఈక ముక్కతో సమానం అని ఆయన అన్నారు.
అంబేద్కర్ కోనసీమ, అమలాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శెట్టిబలిజ సంఘ యువ నేత వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం, సుభాష్ తల్లి, అమలాపురం కౌన్సిలర్ వాసంశెట్టి కృష్ణకుమారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అనుచరులతో సంప్రదించి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వెల్లడిస్తామని ప్రకటన. స్థానిక అమలాపురం వైసీపీ నాయకత్వం వేధింపుల వలనే రాజీనామా అని ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినా మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు.
విజయవాడ, కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. కోర్ట్ కి రావడం లేదు. జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు. సుబ్బరాజు శ్రీను సోదరుడు. నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు. నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి. రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం. ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని ఒక్కడికి ఒక న్యాయం. జగన్ కి అనేక సార్లు విన్నవించాం. జైల్ లో శ్రీను, విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం. NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది. జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి. లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం.
హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గ వైపు ఈరోజు దూసుకువస్తుంది. కుప్పం అభివృద్ధి వైస్సార్సీపీ నె చేస్తుంది. ఎంపీ రెడ్డప్ప గత సంవత్సరం ఇచ్చిన హామీలను ఎన్నికల లోపు నెరవేర్చి ఓటు అడుగుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కుప్పం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో హంద్రీనీవాను విడుదల చేసి మేము ఎన్నికలకు పోతామని ఎంపీ రెడ్డప్ప తెలిపారు. 35 సంవత్సరాల ఎమ్మెల్యే చంద్రబాబు చేయని అభివృద్ధి మేము చేశామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్, ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలకు తెలిపారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి సాగు మరియు త్రాగునీరు ఇవ్వలేకపోయినా చంద్రబాబునాయుడుకు ఓటు అడిగే అర్హత లేదని ఎద్దేవా చేశారు.
సామాజిక న్యాయమే తన ఎజెండా అని జగనన్న మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, పిరియా విజయ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలనే నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని తెలిపారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదేవిధంగా సిఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు. ఎల్లప్పుడూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను ఉపయోగించుకుని అందలాలెక్కే చంద్రబాబునాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి శతశాతం ఫలితాలు సాధిస్తామన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ ప్రజలకోసం రూ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నారు. ప్రతి ఇంటా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో అంతా కళ్ళముందే అందరికీ కనిపిస్తోందని పేర్కొన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.