నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు, అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్కు చేరుకుని నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం పైలాన్ను ఆవిష్కరించనున్నారు, అక్కడి నుంచి కడప చేరుకుని పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
ysrcp
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు, విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ఎకానమీ కార్పొరేట్ స్కూల్లలో 2/3 వంతు పిల్లలు అడ్మిషన్లే తగ్గిపోయాయని వాపోయారు. జనాలను బానిస బతుకులకు అలవాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇదే కాకుండా కేంద్రీయ విద్యా వ్యవస్థ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో నిర్వహణ కష్టతరంగా మారడానికి కారకుడుగా సీఎం జగన్ నిలిచాడని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల గత మూడు సంవత్సరాల్లో 8 వేల స్కూలు మూతపడ్డాయని, అప్పుల బాధతో కొన్ని వందల మంది కరస్పాండెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలు కూడా రాజ్యాంగబద్ధంగా రిక్రూట్మెంట్ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి మేల్కొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. లేదంటే తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా నిరుద్యోగ యువత అందరూ ఎదురుతిరిగి రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి మరో శిరీష అలియాస్ బర్రెలక్క స్థాయిలో పోటీ చేసి తగిన బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు
భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం భారత రాజ్యాంగం అని పొన్నూరు ఎమ్మెల్యే, వైయస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కిలారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ.. భారతదేశానికి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని మన రాజ్యాంగానిదే అన్నారు. వివిధ కులాల, మతాల, సంస్కృతుల, ప్రాంతాల భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఆ మహానీయుడు అంబేద్కర్ అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి భవిష్యత్తు మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పొన్నూరు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఈ ఐలాండ్ సెంటర్ ప్రాంతం నేటి నుండి అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేస్తూ తీర్మానం చేశామని, ఇకనుంచి దీన్ని అందరూ అంబేద్కర్ సెంటర్ గా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల క్యూసెక్కులను తరలించవచ్చు అని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని మహోన్నత సంకల్పాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తుండడం ఈ ప్రాంత వాసుల ఆనందానికి వెలకట్టలేనిది అని చెప్పారు.
రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది. దళితులను , బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు , దోపిడీ, అత్యాచారం ప్రశ్నిస్తే , అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై నొ యాక్షన్. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని , గౌతు శిరీష , పంచుమర్తి అనురాధ లు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బిసి మహిళలను అవమానించి , రోతపుట్టించే రాతలు రాయించి , నా బిసిలు అని మాట్లాడటానికి సిగ్గుందా..? పేరుకే బిసి మంత్రులు , పెత్తనం అంతా రెడ్లదే..? జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స , ధర్మాన , సీదిరి , తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు. వైసిపి ప్రేరేపితంగా హత్యగావింపబడ్డవారు 74 మంది బిసిలు, 28 మంది దళితులు ఉన్నారు. రజక , యాదవ , నాయిబ్రాహ్మన , మత్స్యకార , గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టిటిడి చైర్మెన్లుగా బిసిలకు పెద్ద పీట వేసింది టిడిపినే. వైసిపి రెడ్డిలకు మాత్రమే టిటిడి చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలు అశపడాలా.? బిసి పధకాలు ముప్పై రద్దు చేసారు. ధర్మాన , బొత్స , తమ్మినేని నిజమైన బిసిలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది విసిలు రెడ్లేనా? బిసి నాయకులపై తప్పుడు కెసులు పెట్టారు. బిసిలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబు పై కుట్ర చేసారు. బిసిలు బాగుపడితే జగన్ కు కడుపు మంట. బిసిల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు. బిసిలకు అండగా ఉన్నారనే బాబు పై అక్రమ కేసులు పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతి వస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో రాత్రికి బస చేసి నవంబరు 27న శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా, తిరుమల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వెళ్లనున్నారు.
రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటారని నిర్వాహకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కబాడీ పోటీలను చిత్తూరు జిల్లా ఎం.పి.రెడ్డెప్ప ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి ,ఎం.పి.పి.రామ్మూర్తి, జెడ్పిటిసి దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను మాయ మాటలతో మబ్బి పెడుతున్న వైసిపి ప్రభుత్వం, వైసీపీ ఇస్తున్న వాగ్దానాలను విని విని విసికెత్తిపోయిన ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త పథకాలకు కాగితాలపై జీవోలు అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్న వైసిపి ప్రభుత్వం అని, 4 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే 215 కోట్ల తో సోమశిల బ్యాక్ వాటర్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి తీసుకుని వస్తామని చెప్పి ప్రజల చెవులలో పెద్ద కాలిఫ్లవర్ పెడుతున్నారని పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వేకోడూరు వ్యంగీకరించారు. నియోజకవర్గంలో కనీసం 10 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సోమశిల బ్యాక్ వాటర్ తో సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరం అన,. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క చెరువు కైనా మరమ్మత్తులు మొదలు పెట్టారా పూర్తి చేశారా అని ఎద్దేవ చేసారు. చిట్వేలి మండలం ఎల్లంరాజు చెరువు మొండిగట్టు మరమ్మత్తు కు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దాని పని పూర్తి చేస్తామని మీ హామీలో కూడా ఉందని అయినా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పుల్లంపేట మండలంలో నూకనపల్లి, అనాసముద్రం, వత్తలూరు చెరువులకు మరమ్మత్తులు చేయలేదు అయినా కొత్త ప్రాజెక్టులు తెస్తామని ప్రజలను మోసం చేస్తున్న వైసిపి ప్రభుత్వం అని, రైల్వే పనులు, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కు సంబంధించి చేసిన భూమి పూజలు మళ్ళీ మళ్ళీ చేసి ప్రజలను మోసం అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని చెప్పి అనేక నిబంధనలతో అడ్డుకుంటున్న వైసిపి ప్రభుత్వం. ఈ విధంగా ప్రజలను అనేక రకాలతో మోసం చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోరని ఇకపై వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పంతగాని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoచగా వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని ,అధిక డీజిల్ ధరలతో ,రోడ్లు సరిగా లేక ఆటోలు రిపైర్లు రావడంతో కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యారని డ్రైవర్లు వాపోయారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అసలే అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు,ఆపై జరిమానాలు. పెట్రోలు, డీజిల్ ధర మంటలు నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు ఇవీ ఆటో, క్యాబ్, ట్రక్కు డ్రైవర్ల కష్టాలు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే స్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం లేదన్నారు. గ్రామీణ ప్రాతాల్లో కనీసం ఓ కిలోమీటరైనా సరిగా లేని రొడ్లు.! ఆపై పొరపాటున ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారంతో వారి కుటుంసభ్యులు కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోందనీ దీనికి తోడు కేసులతో పాటు జరిమానాలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డ సవితమ్మ. ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, నల్లూరు మాజీ సర్పంచ్ గోపాల్, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి, సనాఉల్లా బాలాజీ నాయక్, మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి రాంపురం అంజి, మంజు, గోవిందప్ప, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.