తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య మంత్రిని విమర్శించే స్థాయి టిడిపి జనసేన నాయకులకు లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ లు ఇరువురు నోరు అదుపులో పెట్టుకుని ముఖ్యమంత్రి గురించి అవాకులు చవాకులు పేలితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక మండల పరిధిలోని పెద్ది ఈటిపాకం పంచాయతీలో జగనన్నే మళ్లీ సీఎం కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి విద్యాదేవన వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూలు అభివృద్ధి ఆసరా చేయూత రైతులకు వడ్డీలు లేని రుణాలు ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల నిధుల్ని ముఖ్యమంత్రి జగనన్న బటన్ నొక్కి నేరుగా అర్హులైన వారి ఖాతాల్లోకి వేస్తున్నారంటూ ఆయన అన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయంలో సత్యవేడు అభివృద్ధికి ఏమి చేశారో టిడిపి నాయకులు బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ శ్రేణులకు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సీఎం జగనన్నను సైకో అంటూ విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేతకావంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2024 ఎన్నికల్లో ప్రజల అండదండలతో భారీ మెజార్టీ గెలుస్తారని ఆయనే మళ్లీ సీఎం అవుతారంటూ ఆయన పేర్కొన్నారు.
ysrcp
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి, ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. అయితే.. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణం అసన్నమైoది. కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మికి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి అరటి గెలలు నేలమట్టమయ్యి.. దర్శనం ఇచ్చాయి. సంవత్సర కాలం పంటల సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు వరలక్ష్మి. 6 సంవత్సరాలుగా పంటలు చేస్తున్నామని.. కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నష్ట పరిహారం అందినదని.. నాటిన మొలకలకు కూడా 30 వేల ఆర్థిక సహాయం అందినదని హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమ పరిస్థితి చూసి తమకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని.. సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే అందుకు కారణం సీఎం జగన్ అన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరలా అధికారంలోకి తామే వస్తామని.. జగన్ సీఎంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయమన్నారు. ఎంతటి వారికైనా కొన్ని లోటు పాట్లు వుంటాయని… అవి కూడా తొందర్లోనే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నాడని విమర్శలు చేశారు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ జగన్ ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తి కావడంతో ఈ టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన వస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గాలేరు నగరి వరద కాలువ నిర్మాణంలో భాగంగా అవుకు రిజర్వాయర్ సమీపంలో రెండు టెన్నల్ ల నిర్మాణానికి అప్పటి వైయస్ ప్రభుత్వం 2008 లో శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కొక్కటి ఆరు కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను 436 కోట్లతో నిర్మించారని కాటసాని రామిరెడ్డి తెలిపారు. టన్నెల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రైవేట్ వ్యక్తులచే టిడిపి ఓటర్ వెరిఫికేషన్ చేయించడంపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓటిపిల సేకరణతో ఫోన్లు హ్యాకింగ్ చేసే ప్రమాదం కూడా ఉందని, గతంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వం కేటాయించిన బిఎల్ఓ లు, పార్టీల బిఎల్ఏలు మినహా ఎవరు ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ఓటిపిలు అడిగిన పోలీస్ స్టేషన్ కు అప్పగించడం తథ్యం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని…నేడు ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం..కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. అక్కడ సబ్స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం….16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు.
Read Also..
మహిళ పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే అన్నారు మంత్రి రోజా. తాను చదివిన కాలేజీలోనే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఆర్కేరోజా. కాలేజీలో చదివే రోజులను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో వార్షిక పూర్వవిద్యార్థినుల సమ్మేళనం కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు టీచర్ చెప్పినట్టు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎవరెన్ని అడ్డంకు సృష్టించిన , అవమానించిన
ధైర్యంగా లక్ష్యం వైపు వెళ్లాలని సూచించారు. అనుకున్న రంగంలో మనం విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక , మఠం భూములు ,ఎర్రచందనం మాఫియా లాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహా యాదవ్ తో కలిసి దొంగ ఓట్లు పైన ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు .ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్ల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు, వారికి నేను అండగా ఉంటాను. వైస్సార్ కుటుంభంలో ఎలాంటి సమస్యలు ఎదురైన సహించేది లేదు. అందరికి ఒకే ఫెస్ ఉంటుంది, అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నాము. వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం అందరం కృషి చేయాలి.
Read Also…
Read Also…