మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే అందుకు కారణం సీఎం జగన్ అన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరలా అధికారంలోకి తామే వస్తామని.. జగన్ సీఎంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయమన్నారు. ఎంతటి వారికైనా కొన్ని లోటు పాట్లు వుంటాయని… అవి కూడా తొందర్లోనే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నాడని విమర్శలు చేశారు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ జగన్ ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో…
341
previous post




Total views : 214655