పత్తిపాడు టిడిపి నియోజక వర్గ ఇంచార్జి రామాంజనేయులు పాయింట్స్ .. గుంటూరు…వైసీపీ కార్యక్రమాలు కాపీ కొట్టాల్సిన అవసరం టిడిపి, జనసేనలకు లేదు.. గుంటూరు లో టిడిపి. జనసేన పత్తిపాడు కార్యకర్తల ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో టిడిపి రూపొందించిన సూపర్ సిక్స్ అంశాలతో పాటు జనసేన పొందుపరచిన ఐదు అంశాలను ప్రతి ఇంటికి తీసుకు వెళ్లతాం.. బిసి చట్టం ,అమ్మకు వందనం.కవుల రైతుల సమస్యలు లాంటివి ఎన్నో పరిష్కారం చేస్తామని వివరిస్తాం. రాష్ట్రంలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా టిడిపి ,జనసేన ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలకి వివరిస్తాం…. ప్రతి పేదవాడి ని అభివృద్ధి పథంలో పాటు లక్షాధికారి ని చేయడమే మా ఇరు పార్టీల లక్ష్యం. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన తరువాతే పేదవాడికి రెండు రూపాయలకి కిలో బియ్యం ప్రసాదించిన వరం గా భావించారు. టిడిపి కార్యక్రమాలు రూపకల్పన లాంటి అనేక విషయాలు ఇతర పార్టీల నేర్చుకోవాలి.
ysrcp
నాలుగున్నర ఎల్ల తర్వాత సీఎం జగన్ కి వరికేపూడిసెల గుర్తొచ్చిందా… ఆరు నెలల ముందు శంకుస్థాపన చేసే ఏ ప్రాజెక్టుని కూడా నమ్మకండి అని గతంలో జగన్ అనేక సభలలో చెప్పాడు… రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది… కేవలం ఎన్నికల కోసమే ఈరోజు వరికేపూడిసెల శంకుస్థాపన… పల్నాడు రైతులను ఎమ్మెల్యేలు నిలువునా మోసం చేశారు… ఒక్క రూపాయి విడుదల చేయకుండా ప్రాజెక్టుని ఎలా కడతారు… గతంలో మీ నాన్న ఇదే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేశారు… టీడీపీ ప్రభుత్వ హయాంలో 340 కోట్లు విడుదల చేశాము… చంద్రబాబు ఇచ్చిన 340 కోట్ల నిధులలో ఒక్క రూపాయి అయినా వైసీపీ నేతలు కర్చుపెట్టలేదు… దేశంలో అతి పెద్ద మోసగాడు ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే… వరికెపూడిసెలపై సీఎం జగన్ చెప్పేవన్ని పచ్చి అబద్ధాలే… పల్నాడులో రైతు కళ్ళ ముందే నిలువునా పంటలు ఎండిపోతున్నా,జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు… మంత్రి అంబటి రాంబాబుకి ఏమాత్రం సిగ్గు ఉన్నా సరే వెంటనే రాజీనామా చేయాలి…
గత నెల 26వ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది. సైకిల్ తుప్పు పట్టింది,గ్లాసు పగిలిపోయింది. పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. చంద్రబాబు జైల్ నుండి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదు. నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది జగనన్న స్పీకర్, చైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది. చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచా నాదెళ్ల మనోహర్ ప్రెస్మీట్ పెట్టీ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటాడు. తప్పో కాదో ప్రజలే చెప్పాలి. పేదవారిపై వీరంతా కక్ష కట్టారు.
సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు .. అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్.. 1,12,795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు అందించాం.. 25 వెలు కోట్ల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు చేశాం.. రాష్ట్రం లో 151 సీట్లు గెలిచిన మనం 175 సీట్లు ఈజీగా గెలుస్తాం .. శ్రీకాకుళం లో మూలపేట పోర్ట్, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శుద్ధి జలాల నీటి అందించడం మా ప్రభుత్వ ఘనత.. నాలుగు సంవత్సరాలలో రూపాయి లంచం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం.. గతంలో ఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చూడలేదు… ఎప్పుడూ అణగదొక్కాలని చూశారు.. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ పదవులు ఇచ్చిన ఘనత మనదే.. 2024 లో జగనన్న గెలుపు వన్ సైడ్ , టిడిపి సూసైడ్, జనసేన ఔట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజలు డిసైడ్..
అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే.. చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము.. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను ఇచ్చిన మన శ్రీకాకుళం కు ఓక్క సంస్థను కూడా బాబు ఇవ్వలేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వికేంద్రీకరణకి అడుగులు వేసాం.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే విశాఖపట్నం కి రాజధాని రావాలి.. రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటే అక్కడ కర్నూల్ ఓక రాజధానిగా ఉండాలి.. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండాలి. మహిళలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ పెద్ద ఎత్తున ఇళ్లపట్టాలని అందజేశాం.. తెలుగుదేశం , జనసేన కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు.. ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీరు దాన్ని గమనించండి జగన్ కి ఓటేయండి..
Read Also..
వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది.. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు.. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది.. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు.. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు.. ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే.. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది.. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు..
గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని, అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని చెప్పి హుకుం జారీ చేసిందని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మీద, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం లో 8,000 పెన్షన్లు తీసేసారన్నారు. కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఎలా కబ్జా చేశాడో, మన పొన్నూరు ఎమ్మెల్యే గుళ్లను అలా కబ్జా చేశాడన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ కి రావాలన్న కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదాయం నెలకు 20 లక్షలన్నారు. 5లక్షల నుంచి 6 లక్షలు రేషన్ మాఫియా నుండి వసూలు చేస్తున్నాడన్నారు. బస్సు యాత్రకు వచ్చే నాయకులకు, మంత్రులకు సిగ్గుండాలన్నారు. సీఎం ఆఫీస్ ఐడి కార్డులు పెట్టుకొని గ్రావెల్ అమ్ముకొని ఈ ప్రభుత్వం 500 కోట్లు దోపిడీ చేశారన్నారు. బస్సు యాత్రకు డ్వాక్రా, వాలంటీర్నీ తరలించాలని అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి మీద సమాధానం చెప్పి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ధూళిపాళ్ల ముగించారు.
Read Also..
విజయనగరం జిల్లా
గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్. సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న సేవలకు మెచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గం మర్రపు సురేష్ మాట్లాడుతు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో భాగంగా ఇటువంటి బేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా కష్టపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు జనసేన పార్టీ నాయకులు అహర్నిశలు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏమీ చేయనోడే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ చేసిన నేనేందుకు చెప్పుకోకూడదు అంటూ మాజీ మంత్రి అమరనాథ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. పలమనేరు కొత్తపేట సచివాలయ పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు చేయలేదో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలన్నారు. ఈ నిధులంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు కట్టించుకుని పేద ప్రజలను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానిదైతే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. సంక్షేమ పాలన కావాలంటే మరోసారి తనకు ఓటువేసి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు – యనమల రామకృష్ణుడు
ఏపీ సీఎం జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారి మళ్లించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.