రేపు 20 వ తేదీన మధ్యాహ్నము 2గంటల నుండి పోలిపల్లి గ్రామంలో యువ గళం – నవ శకం, టీడిపి ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభిమానుల తో పాటు భీమవరం, చింతల పూడి నియోజక వర్గాల టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడిపి రాష్ట్ర కార్యదర్శి, భీమవరం AMC మాజీ చైర్మన్,చింతల పూడి నియోజక వర్గ పరిశీలకులు, భీమిలి తాత్కాలిక పరిశీలకులు కోళ్ళ నాగేశ్వర రావు కోరారు.
yuvagalam
యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ. ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2867.8 కి.మీ. 211వరోజు (28-11-2023) యువగళం వివరాలు అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు…
ఉదయం
8.00 – పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.
10.00 – అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.
10.15 – అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.
10.30 – అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం.
10.45 – అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.
12.30 – భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.40 – భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి.
1.40 – భట్నవిల్లిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – భట్నవిల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.00 – అనంతవరం సెంటర్ లో స్థానికులతో సమావేశం.
6.00 – గున్నేపల్లిలో స్థానికులతో సమావేశం.
7.45 – ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.
8.30 – ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్మ్యాప్ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also..
Read Also..
అమరావతి ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ. ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర. గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు. అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న లోకేశ్. ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభం. ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగితెలుసుకున్న నారా లోకేశ్. పాదయాత్రలో హామీలిస్తూ ప్రజలకు భరోసా కల్పించిన యువనేత.





Total views : 90706