మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారి పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నే చెన్నూర్ ప్రజలు బట్టలు విప్పి కొట్టి పంపారని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు. మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీల పై తొలి సంతకం చేశారని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 68 వేల మిగులు బడ్జెట్ ను అప్పుల రాష్ట్రంగా మార్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. .కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని,కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన అన్నారు..
వృధా అయిన ప్రజల సొమ్ము దోచుకున్న సొత్తును తిరిగి కక్కిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూర్ లో ఉద్యోగాల్లో, మంచి నీటి సరఫరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు..ప్రతి మండలంలో తిరిగి ఎం కావాలో,ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కార దిశగా ముందుకెళుతానని ఆయన చెప్పారు..బ్యాక్ వాటర్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని,చెన్నూర్ ప్రజలు తమపై ప్రేమ చాలా చూపించారని,మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఇతర నాయకులకు చెన్నూర్ ప్రజలకు కృత్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని,కొత్త నాయకులను పార్టీలో తీసుకునే అవసరం లేదని అయన స్పష్టం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వున్నారు.
Adilabad
: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ లో ప్రజలకు ఉన్న సమస్యలైన, ఫిర్యాదులైన తమ ద్రుష్టి కి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, వారి పరిమితి లో లేనివి పై అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.మున్సిపాటీ అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు, సిబ్బంది కల్సి కట్టుగా కృషి చేయాలనీ కోరారు.
చెన్నూరు నియోజకవర్గం లోని స్థానిక మందమర్రి పట్టణ మార్కెట్ లో చెన్నూరు నియోజీకవర్గా ఎమ్మెల్యే గడ్డం వివేక్ నల్లాల ఓదెలు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించిన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు .చేసారు .ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసార్ల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ మాజీ NSUI స్టేట్ సెక్రెటరీ మహంత్ అర్జున్ కుమార్ యూత్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు. రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా. ఊరు కొండారెడ్డి పల్లె. తండ్రి నరసింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. 1969 ఆగస్టు 8న జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది. కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు. రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10,919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్కు కలిసొచ్చాయి. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డీలా పడిపోయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా.. కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది. BRSకు చెందిన సీనియర్ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది.
తెలంగాణ ఓట్ల లెక్కింపు ఆసక్తి రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో సాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ఇక మజ్లిస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఆధిక్యంలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ముందంజలో ఉన్నారు. ఇక కేసీఆర్, రేవంత్ రెడ్డిలు పోటీలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు అగ్రనేతలు పోస్టల్ బ్యాలెట్లలో వెనకంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలయ్యాక రేవంత్ ఆధిక్యంలోకి వచ్చారు. హైదరాబాద్ లోని చాంద్రాయణ్ గుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, మధిరలో భట్టి విక్రమార్క లీడ్ లో ఉన్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
మంచిర్యాల జిల్లా లో ఓటర్లు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించటం లేదని కాసిపేట మండలం వరిపేట, కొత్త వరిపేట గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేగాని ఓటు వేయమని బీష్మించుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 390 ఓట్లు ఉన్నాయి. తమకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని, పాటు కెనాల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి రావాలని అప్పటి వరకు ఓటు వేయమంటూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు
జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. తాజాగా 214వ పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడి జరిగింది. ఒకరిమీద ఒకరు రాళ్లదాడులు, బూతులతో ఘర్షణకు దిగారు. అంతకు ముందు ఉదయం జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూతు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాగ్వాదంగా మొదలై.. ఘర్షణకు దారి తీసింది. మొదట జనగామ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమవుతుందని అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్లినట్టుగా బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో పార్టీ కండువాలు కప్పుకుని వస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. ఎక్కువ సమయం బూత్ లలో ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగాగ అది ఘర్షణకు దారితీసింది. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కలగచేసుకుని ఇరు వర్గాలను కేంద్రాల దగ్గరినుంచి బైటికి పంపారు. గొడవ సద్దుమణిగి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని. విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు FST టీమ్ తో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కార్ల అద్దాలు ద్వంసం గాయాలయ్యాయి. బీజేపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోడ దూకి ఇంట్లోకి వచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు





Total views : 194471