గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజా సింగ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో విధ్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నవరాత్రి దాండియా కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.
Hyderabad
బోరబండలో ఓ ఎస్సై చేస్తున్న హంగామా తో స్థానికులు వాహనదారులు తీవ్రభయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి వేళలో కర్ర పట్టుకుని తిరుగుతున్న ఎస్సై కళ్ళకు ఎవరైనా కనిపిస్తే చాలు వీపు విమానం మోత మోగిస్తున్నారు.. అలాంటి కొన్ని దృశ్యాలను సాక్షాత్తు ప్రజలే తెలియకుండా వీడియోలు తీసి ఎస్సై చేస్తున్నా అరాచకాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ ప్రకటించి బీసీ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు.తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే, హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ యజమానులను అప్రమత్తం చేసింది.ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల గ్రామానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని వేడుకున్నాడు.
గత తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలకు రాయలసీమ వాసులకు ఎలాంటి సంబంధం లేదని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. పంజాగుట్ట లోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధి సుస్థిరపాలనకే తమ మద్దతు, మేము సెటిలర్స్ కాదు తెలంగాణీయులమే అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రజలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో సీమ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఇటీవల కొందరు సీమాంధ్ర ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పి చేసే వ్యాఖ్యలు తీవ్ర విచారకరమని అన్నారు. రాయలసీమ వాసులు ఎవరు ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించారని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంబోత్ రాంబాబు స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో తమ జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల పై పెట్టిన శ్రద్ద విద్య , వైద్యం , ఉపాధి అంశాలపై పెట్టలేదని విమర్శించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ తమకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను కలరాస్తుందని మండిపడ్డారు. తాము ఈ పోటీలో గెలవకపోయిన తమను విస్మరించిన వారిని ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ ఆఫ్ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్ గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్సచిన్తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరుఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ మారథాన్లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.






Total views : 200828