Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

by Satya
rahul gandhi

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదన్నారు. మోదీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సర్కార్‌ వస్తుందని రాహుల్‌ చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

025455
Total views : 147299

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.