Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana విద్యుత్​ అధికారులకు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

విద్యుత్​ అధికారులకు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

by Satya
Revanth Reddy


విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం :

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో విద్యుత్ అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కరెంట్ కొరత లేకున్నా సరఫరాను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. ఇక మీదట కరెంట్ సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారుల కుట్రలను సహించేది లేదని మందలించారు.

ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కల్పిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడినంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఎక్కడ విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరెంట్ సరఫరా పెరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులను హెచ్చరించారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

Advertisements

You may also like

Our Visitor

039472
Total views : 196989

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: