Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News క్వారీలో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

క్వారీలో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

by Prakash
student sucide

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో గత బుధవారం 15/11/2023 రోజు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. వివరాల్లోకి వెల్తే: మంగలి ఆకాష్ అనే విద్యార్థి షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు బుధవారం 15/11/2023 పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ సహాయంతో డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఈ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు శ్రమించిన ఫలితం లేకపోయింది ఆ యొక్క క్వారీ లోతు దాదాపు 200 అడుగులు ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు ఈరోజు ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశాయి. తన తల్లిదండ్రులు అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు..

Read Also…

Read Also…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: