Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra PradeshSrikakulam వందే భారత్ రైలు లో ప్రయాణించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు..

వందే భారత్ రైలు లో ప్రయాణించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు..

by Rama
Vandhe bharath rail

విశాఖ -భువనేశ్వర్ వందే భారత్ రైలు (visakha-bhuvaneswar vandhe bharath)ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలవడంతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రైల్ లో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం (Ichchapuram) వరకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) ప్రయాణించారు. ఇచ్చాపురంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుకి రైల్వే అధికారులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్, తో పాటు టిడిపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడు రైల్వేస్టేషన్లలో ఆగడం ఆనందమని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి శ్రీకాకుళం ఎంపీ పరిధిలోని పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి విన్నవించగా, ఒకటొకటిగా పరిష్కారం అవుతున్నాయని ఎంపీ రామ్మోహన్ అన్నారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

త్వరలో మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైలు ఇచ్చాపురంలో ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జి, జాడపూడిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ జరగనున్నదని అన్నారు. రైల్వేపరమైన అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు శ్రీకాకుళం జిల్లా కు తాము చేసిన కృషికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని,తమ వద్దకు వస్తే అన్ని చూపుతామని అన్నారు ఎంపీ రాము రామ్మోహన్ ఇచ్చాపురం రైల్వే సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంగా ఇచ్చాపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇదిచదవండి: ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడు ఆత్మహత్య..


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: