Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh విజయ డైరీ నూతన ప్రాజెక్టు ప్రారంభం…

విజయ డైరీ నూతన ప్రాజెక్టు ప్రారంభం…

by Prakash
Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swami

బాపులపాడు మండలం వీరవల్లి లో విజయ డైరీ నూతన ప్రాజెక్టును ప్రారంభించిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రాజెక్టు కామధేనువుతో అత్యాధునిక సాంకేతికతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లక్షలాది కృష్ణ మిల్క్ యూనియన్ పాడి రైతుల ఆకాంక్షలు సహకారం విజయ డైరీ చైర్మన్ శిలసాని ఆంజనేయులు అన్నారు. వీరవల్లి లో 188 కోట్ల వ్యయంతో నిర్మించిన విజయ పాల ఫ్యాక్టరీ విజయ కామదేను శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దివ్య కర కమలముల మీదుగా గురువారం ప్రారంభించారు, తక్కువ ఖర్చుతో నాణ్యత ప్రమాణాలతో కూడిన పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికత మిషనరీ ని జీయర్ స్వామికి చైర్మన్ వివరిస్తూ కారణం మొత్తం చూపించడం జరిగింది కృష్ణ మిల్క్ యూనియన్ నాలుగు సంవత్సరాల తపన రెండు సంవత్సరాల నిర్విరామ కృషితో లక్షలాది పాడి రైతుల కుటుంబాల కలల సహకారమైందని దీనికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు చైర్మన్ శిలసాని కృతజ్ఞతలు తెలియజేశారు…..

ప్రతిరోజు ఆరు లక్షల లీటర్లు పాలు పోరాసిసింగ్ చేయడంతో పాటు అవసరమైతే 8 లక్షల లీటర్ల పాలను కూడా ప్రాసెసింగ్ చేసే విధంగా పరిమితి పెంచేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని ఎండి కొల్లి ఈశ్వర బాబు వివరించారు. విజయవాడలో 59 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పాల ఫ్యాక్టరీ నిర్వహణ వ్యయం పెరుగుతుందని అందుకే తక్కువ నిర్వహణ వ్యయంతో అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన బాల ఉత్పత్తులను ప్రజలకు అందించాలని లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కామధేను నిర్మించడం జరిగిందన్నారు.అత్యున్నత నాణ్యత ప్రమాణాలను అందించాలని లక్ష్యంతో ఈ ప్రాజెక్టు కామదేను నిర్మించడం జరిగిందన్నారు.

అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పాల ఉత్పత్తుల మార్కెట్ను వివరిస్తూ 1500 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని అందుకునే విధంగా వచ్చిన లాభాలను పాడే రైతులకు అందించే విధంగా కార్యచరణ రూపొందించి ముందుకు సాగామన్నారు. ఒక్క చుక్క పాలు కూడా వృధా కాకుండా అత్యధిక సాంకేతికతో గంటకు పదివేల లీటర్ల పెరుగు తదితర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రస్తుత కాంపిటేటివ్ మార్కెట్లో మనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1,50,000 మంది పాడి రైతులు చేస్తున్న అభిరామ కృషి చేసే వారికి సేవలు అందించే విధంగా మండల జానకి రామయ్య గారి అడుగుజాడల్లో కృష్ణ మిల్క్ యూనియన్ లో పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చైర్మన్ అన్నారు. ప్రపంచానికే తల మాణికమైన రామానుజ విగ్రహాన్ని నిర్మించడం సేవ పరమావధితోనే సాధ్యమైందని అదే స్ఫూర్తితో ప్రాజెక్ట్ కామధేను మొదలు పెట్టడం జరిగిందన్నారు.

శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ….

కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు ఉత్సాహం కలిగిన రైతు అన్నారు. తల్లిని మరిపించే శక్తి తల్లి ఇచ్చే పోషణ పాలకు ఉందని అలాంటి పాలను పాల ఉత్పత్తులను నాణ్యతతో అందించడం ద్వారా ప్రజలకు మంచి వాత్సల్యంతో కూడిన హస్తాన్ని అందించే శక్తిని పాడి రైతు కుటుంబాలకు ఈ ప్రాజెక్టు కామదైన ద్వారా కల్పించిన చైర్మన్ , చలసాని ఆంజనేయులు చేస్తున్న కృషి అభినందనీయమని జీయర్ స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ పాలకొరక సభ్యులు ట్రస్ట్ సభ్యులు పాల సంఘాల అధ్యక్షులు వాటి రైతులు కృష్ణ మిల్క్ యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014299
Total views : 79783

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.