Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై ధర్నా..

తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై ధర్నా..

by Prakash
Women Darna

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, కొత్తూరు గ్రామంలో త్రాగునీరు సరఫరా లేదంటూ ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గత నాలుగు నెలలుగా మిషన్ భగీరథ మోటర్లు పనిచేయక నీటి సరఫరా లేక త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న ఏ అధికారి తమ వంక చూడలేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రోడ్డుపై టెంట్ వేసి రోడ్డుకి అడ్డంగా కర్రలు పెట్టి మహిళలు ధర్నాకి దిగడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వేసవి రాకముందే ఇన్ని ఇక్కట్లు ఉంటే వేసవిలో మరింత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య తీరేవరకు ధర్నా విరమించేది లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197058

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: