Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshEast Godavari అర్ధరాత్రి వేళ కోళ్ల చోరీ..

అర్ధరాత్రి వేళ కోళ్ల చోరీ..

by Rama
theft of hens

ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించిన నలుగురు దుండగులు పందెం కోళ్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఎప్పటి లాగానే గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చిన్న కోళ్ల ఫారంలో నిదురిస్తున్న మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పద్మావతి దంపతులను కత్తులు మెడపై పెట్టి చంపేస్తామని బెదిరించిన నలుగురు గుర్తు తెలియని దుండగులు. కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన అగంతకులు మెరుగైన 11 పందెం కోడిపుంజులను చోరీ చేశారు. బయటకు అరిస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించినట్లు బాధితులు శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిపుంజులను చోరీ చేసి దుండగులు ఉడాయించగా, అక్కడే ఉన్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించగా, అగంతకులు స్టార్ట్ కాకుండా చేశారని వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: