Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవకు ఘన స్వాగతం పలికిన అనంతపురం టిడిపి శ్రేణులు

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవకు ఘన స్వాగతం పలికిన అనంతపురం టిడిపి శ్రేణులు

by Satya
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవకు ఘన స్వాగతం పలికిన అనంతపురం టిడిపి శ్రేణులు

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన పయ్యావుల కేశవకు అనంతపురం గుత్తి పట్టణంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక గాంధీ సర్కిల్లో క్రేన్ సహాయంతో పయ్యావుల కేశవకు భారీ గజమాలతో సత్కరించారు. పయ్యావుల కేశవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి పట్టణ శివారు వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగుంతకల్ ఎమ్మెల్యేజయరాం,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్,మడకశిర ఎమ్మెల్యేఎమ్మెస్ రాజు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు,అనంతపురం ఎంపీఅంబిక లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయిన అనంతపురం జిల్లాకు ఒక కూలివాడిగా పని చేస్తానన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదించక పోయిందన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు,సాగునీరు అందించే దిశగా పనిచేస్తానన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014695
Total views : 80874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.