Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ఐఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ రియాక్ట్

ఐఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ రియాక్ట్

by Satya
Rahul Gandhi

తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీ. వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్ లకు ఆపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శశిథరూర్, రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారారం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు భయపడేది లేదన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013945
Total views : 78633

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.