Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

by Rama
తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన వారిలో కాసు మహేశ్ రెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కాసు మహేశ్ రెడ్డి… ఓటమిపాలయ్యారు. తాజాగా ఆయన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్టు తిట్టి, ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని కాసు మహేశ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని, పైగా చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని… అలాంటి అవమానాలు చంద్రబాబులోనూ, టీడీపీ నేతల్లోనూ కసి పెంచాయని అన్నారు.ఎవరినైనా అవమానాలకు గురిచేస్తే వారు కసితో రగిలిపోయి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు విషయంలో జరిగిందే అదేనని కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు.తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు రామాయణ, మహాభారత పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయని, జగన్ కూడా ఇప్పుడు అదే కసితో పనిచేయాలని అన్నారు.తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీశాయని, మద్యం తాగేవారు తమ పార్టీకి ఓటేయలేదని చెప్పారు. రాష్ట్రంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు, విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు.రాష్ట్రంలో పాతికశాతం మందుబాబులు ఉంటారని, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని తెలిపారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకుఅమ్ముతున్నారని టీడీపీ చేసినప్రచారంమందబాబులపై బాగా ప్రభావం చూపిందని పేర్కొన్నారు.ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపైనా, ఇతర వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
    సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తర‌ణ‌పైన ముఖ్యమంత్రికి నివేదిక అంద‌జేశారు…
  • అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.
    పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో…
  • త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.
    టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి…
  • తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
  • మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.
    పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039120
Total views : 194338

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: