Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Devotional తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

by CVR NEWS

రుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి, క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే 68 వేల 156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 28 వేల 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.46 కోట్లుగా నమోదైంది. దర్శన సమయం 10-12 గంటల నుంచి ఒక్కసారిగా 20 గంటలకు చేరడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు, రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

042043
Total views : 221471

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: