పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాడు,ఏలేశ్వరం,అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు 80 మంది రక్తదానం చేసారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ వారిచే ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు ఈ సందర్భంగా సూచించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం
289
previous post






Total views : 75410