Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home Telangana యువజన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

యువజన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

by Satya
Kavitha

నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని, బీఆర్ఎస్‌ను ఓడించడం ఎవరి తరం కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువత ఉందన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే అని అన్నారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు. కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013571
Total views : 77799

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.