Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana ప్రచారంలో జోరు పెంచిన లక్ష్మారెడ్డి

ప్రచారంలో జోరు పెంచిన లక్ష్మారెడ్డి

by Satya
Bandari Lakshmareddy

ఉప్పల్ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్ ఎక్స్ లో పనిచేస్తున్న కార్మికులు అండగా ఉంటానని ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర మరియు కంపెనీ దగ్గర కూడా కలిసి మద్దతు కోరామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్ఎఫ్సి వర్కర్స్ యూనియన్ ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు తెల్పుతున్నట్లు యూనియన్ మాజీ అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పూర్తి మద్దతు బండారి కుటుంబానికి ఉంటుందని, ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: