Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh తెలుగుదేశం, జనసేన, సీపీఐ పార్టీల నేతల ధర్నా….

తెలుగుదేశం, జనసేన, సీపీఐ పార్టీల నేతల ధర్నా….

by Prakash
Dharna by leaders of Telugu Desam, Janasena and CPI parties

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలంటూ తెలుగుదేశం, జనసేన, సీపీఐ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సిపిఐ నేత రామకృష్ణ, జనసేన నేతలు పూషడపు రత్నగోపాల్, గుడివాక శేషుబాబు. మిచాంగ్ తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన దివిసీమ రైతులు తడిచిన పంట మొలకలు రావడంతో 6 ఎకరాల పంటను ట్రాక్టర్ తో తొక్కించేసిన కౌలు రైతు వర ప్రసాద్. రైతులకు న్యాయం చేయాలంటూ మోపిదేవి మండలం కప్తానుపాలెం వద్ద హైవే పై నిరసన తెలిపిన అఖిలపక్ష నేతలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన నేతలు. ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. ఇది ప్రకృతి సృష్టించిన బీభత్సం కాదు ప్రభుత్వం సృష్టించిన బీభత్సం అని నేతలు ఆరోపిస్తున్నారు. సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా పాలిస్తున్నాడని, రేపు విజయవాడ లో అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేస్తామని , ప్రభుత్వం మెడలు వంచుతాం, పోరాడి సాధించుకుంటాం అని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014176
Total views : 79506

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.