Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor ఆరవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ఆరవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

by Rama
Anganwadi

అన్నమయ్య జిల్లా.. రైల్వే కోడూరు మండలంలోని ఐసిడిస్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి అంగన్వాడి రాష్ట్ర నాయకులు అర్జీ ఇస్తుంటే ఇదేమైనా పెళ్లి పత్రిక అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మంత్రి గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా దారుణం అన్నారు. ఆర్ధిక మంత్రి క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిస్కారం చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జయరామయ్య, సిఐటియు అధ్యక్షులు యానాదియ్య, జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి, ప్రాజెక్ట్ అధ్యక్షరాలు రమాదేవి, ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా కుమారి, కోశాధికారి జి పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు డి వనజ కుమారి పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025690
Total views : 147693

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.