ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య కాలంలో అప్పులు 22 శాతం పెరిగితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో 16.7 శాతంగా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018-19 చంద్రబాబు నాయుడి పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44 లక్షల 86 వేల పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు.
Finance Minister Buggana Rajendranath Reddy
అన్నమయ్య జిల్లా.. రైల్వే కోడూరు మండలంలోని ఐసిడిస్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి అంగన్వాడి రాష్ట్ర నాయకులు అర్జీ ఇస్తుంటే ఇదేమైనా పెళ్లి పత్రిక అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మంత్రి గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చాలా దారుణం అన్నారు. ఆర్ధిక మంత్రి క్షమాపణ చెప్పేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిస్కారం చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జయరామయ్య, సిఐటియు అధ్యక్షులు యానాదియ్య, జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి, ప్రాజెక్ట్ అధ్యక్షరాలు రమాదేవి, ప్రాజెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాధా కుమారి, కోశాధికారి జి పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు డి వనజ కుమారి పాల్గొన్నారు.
Read Also..
తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్లో 241 కోట్ల రూపాయలు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.






Total views : 149587