Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Crime ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్….

ముగ్గురు కేటుగాళ్లు అరెస్ట్….

by Prakash
Three thieves arrested

జల్సాలకు అలవాటు పడి ఈజీమనీనే లక్ష్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లను పేట్ బాషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మేడ్చల్ డిసిపి శభరీష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, మనోహరబాద్ కి చెందిన మహేష్(23), అమీర్(29), రాజు(27) బాల్య స్నేహితులు. ఈజీమనీకి అలవాటు పడి దొంగతనాలే ప్రవృత్తిగా పేట్ బాషీరాబాద్, జీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్, జిన్నారం, శంకరంపేట్ పోలీస్ స్టేషన్ లలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ ఈ రోజు తెల్లవారుజామున ఈ దుండగులు పేట్ బాషీరాబాద్ పోలీసులకు చిక్కారు. వీరిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుండి 17బైక్ లను సీజ్ చేసి నిందితులను పేట్ బాషీరాబాద్ పోలీసులు, మేడ్చల్ డీసీపీ శభరీష్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుకున్న బైక్ ల విలువ 8.5లక్షలు ఉన్నట్టు మేడ్చల్ డిసిపి మీడియాకు తెలిపారు. నిందితులు దొంగిలించి మార్కెట్ లో అమ్మిన బైక్ లను కుడా స్వాధీనం చేసుకుంటామని, దొంగతనాలకు గురైన బైక్ లను కొన్న వారిపై కుడా కేసులు పెడుతామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: